News March 27, 2024
కొల్లిపర: పురుగుమందు తాగిన దంపతులు.. భర్త మృతి

కొల్లిపర మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మండలంలోని తూములూరుకు చెందిన చంద్రశేఖర్ (45), నాగలక్ష్మీ (35) దంపతులు ఆర్థిక సమస్యలతో మంగళవారం పురుగుమందు తాగారు. చంద్రశేఖర్ మృతి చెందగా, నాగలక్ష్మి చికిత్స పొందుతోంది. వీరిది దుగ్గిరాల మండలం ఈమని. డ్రైవరుగా పనిచేసే చంద్రశేఖర్ గతేడాది ప్రమాదం బారిన పడి ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 29, 2025
మహానటి సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: జయసుధ

మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారని సినీ నటి జయసుధ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి నటన విశిష్టమైందని, ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. సావిత్రి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
News September 28, 2025
మహానటి సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: జయసుధ

మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారని సినీ నటి జయసుధ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి నటన విశిష్టమైందని, ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. సావిత్రి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
News September 28, 2025
గుంటూరు జిల్లా వాసులకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటూ మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.