News March 13, 2025
కొల్లూరు: లారీ బోల్తా

కంకర పోసుకుని వెళుతున్న లారీ బోల్తా పడిన ఘటన కొల్లూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన లారీ గుంటూరు నుంచి కంకర లోడ్తో గురువారం తెల్లవారుజామున వెళుతుండగా సిమెంట్ రోడ్డు ఒక్కసారిగా ధ్వంసమైంది. దీంతో లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడిందని అన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని స్థానికులు తెలిపారు.
Similar News
News March 14, 2025
హోళీ పండుగపై కడప ఎస్పీ సూచనలు

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు పలు సూచనలు చేశారు. హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు. అన్ని మతాలవారు మతసామరస్యం పాటిస్తూ ఎదుటివారి మనోభావాలను గౌరవిస్తూ బాధ్యతతో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా హద్దులు దాటితే ఉపేక్షించమని, ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అన్నారు.
News March 14, 2025
‘ఆపదమిత్ర’ అమలుపై కలెక్టర్ సమీక్ష

మెదక్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆపదమిత్ర పథకం అమలుపై వివిధ శాఖల ద్వారా వాలంటీర్లు, రిసోర్స్ పర్సన్స్ గుర్తింపుపై, జిల్లా యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో డిఆర్డిఓ, మెప్మా, హెల్త్, రెవిన్యూ, ఫైర్, మత్స్య శాఖ, ఇండస్ట్రీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ భుజంగరావు కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
News March 14, 2025
నంద్యాల: బంగారు పతకాలు సాధించిన నేహా

నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరుకు చెందిన నేహాకు ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకాలు లభించినట్లు కరెస్పాండెంట్ అబ్దుల్ సలీం తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన 55 కేజీలు, 30 కేజీల పోటీల్లో 2 బంగారు పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేహాకు పలువురు అభినందనలు తెలిపారు. మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు.