News April 14, 2025

కొవ్వూరు: అప్పు అడిగినందుకు హత్య

image

ఇటీవల దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వేస్టేజ్ ఉద్యోగిగా పనిచేసేవారు. ఇతని వద్ద పెద్దవం సచివాలయ సర్వేయర్ శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ పలుమార్లు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ కక్ష పెట్టుకుని మరో ఇద్దరి సాయంతో హత్య చేసి కుడి చేతికున్న బంగారం కోసం చేతిని నరికేశారు. నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.

Similar News

News April 14, 2025

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా చెరుకువాడ

image

వైసీపీ పీఏసీ సభ్యులను పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఈ జాబితాలో రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు చోటు దక్కింది. పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర, ఆచంట మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రంగనాథరాజుకు అభినందనలు తెలుపుతున్నారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 

News April 14, 2025

కైకలూరు: బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో తప్పిన ప్రమాదం

image

కైకలూరు స్టేషన్ నుంచి వెళుతున్న తిరుపతి బిలాస్ పూర్ ఎక్స్‌ప్రెస్‌కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బలమైన ఈదురు గాలులతో కురిసిన వర్షం వల్ల ఏసీ కోచ్ మీద పెద్ద చెట్టు విరిగిపడింది. ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ట్రైన్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

News April 13, 2025

భీమవరంలో చికెన్ రేట్లు ఇలా.!

image

భీమవరం, పాలకోడేరు, వీరవాసరం మండలాలు చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ ధర రూ.800 నుంచి రూ .1000 మధ్యలో ఉంది. అలాగే చికెన్ కేజీ రూ. 240 – రూ.260 మధ్యలో ఉందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉందో కామెంట్ చేయండి.

error: Content is protected !!