News November 16, 2025
కొహీర్: కనిష్టంగా 8.1 ఉష్ణోగ్రత నమోదు

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత రోజుకు తీవ్రంగా పెరుగుతుంది. కోహిర్ మండలంలో కనిష్టంగా 8.1 ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఝరాసంఘం 8.8, సదాశివపేట 9.0, గుమ్మడిదల 9.4, కంగ్టి 9.5, నిజాంపేట 9.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News November 16, 2025
పల్నాడు యుద్ధ వీరుల ఆయుధాల గురించి మీకు తెలుసా.?

11వ శతాబ్దంలో పల్నాడు యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలు నేటికీ సజీవంగా పూజలు అందుకుంటున్నాయి. మహామంత్రి బ్రహ్మనాయుడు ఉపయోగించిన నృసింహకృతం, బాలచంద్రుడు వాడిన సూర్య బేతాళం, సర్వ సైన్యాధ్యక్షుడు మాల కన్నమదాసు భైరవ ఖడ్గం నేటికీ కారంపూడి వీరుల దేవాలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో పూజింపబడుతున్నాయి. ఉత్సవాలకు వీటిని బయటకు తెచ్చి యుద్ధ రీతులలో ప్రదర్శించి ముగింపు అనంతరం తిరిగి భద్రపరుస్తారు.
News November 16, 2025
SBIలో 103 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేశారా?

SBIలో 103 కాంట్రాక్ట్ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, CFA,CFP,MBA, పీజీ డిప్లొమా, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750, SC, ST, PWBDలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://sbi.bank.in/
News November 16, 2025
తమిళనాడు నుంచి ఏపీకి $150 మిలియన్ల పెట్టుబడులు

సౌత్ కొరియాకు చెందిన Hwaseung కంపెనీ ఏపీలో $150 మిలియన్ల పెట్టుబడులు పెట్టనుంది. కుప్పంలో నాన్-లెదర్ స్పోర్ట్స్ షూలను ఉత్పత్తి చేయనుంది. గ్లోబల్ బ్రాండ్లైన Nike, Adidasలను ఈ సంస్థే తయారు చేస్తుంది. కుప్పంలో ఏడాదికి 20 మిలియన్ల షూ జతలను ఉత్పత్తి చేయనున్నారు. 20వేల మందికి ఉపాధి దక్కే అవకాశం ఉంది. ఈ ఆగస్టులో తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నా తాజాగా ఏపీకి వస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.


