News November 26, 2025
కోచ్ చెప్తారు.. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే: సురేశ్ రైనా

ప్లేయర్లు సరిగ్గా ఆడకుంటే కోచ్ను నిందించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అన్నారు. ‘ప్లేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కోచ్కు చెప్పాలి. వాళ్లు బాగా ఆడితే కోచ్కు ప్రశంసలు దక్కుతాయి. టీమ్ బాగా ఆడకుంటే కోచ్ను తొలగించాల్సిన అవసరం లేదు. ప్లేయర్లకు సలహాలు, మద్దతు ఇవ్వడం కోచ్ పని. స్కోర్ చేయాల్సింది ప్లేయర్లే. కోచ్ గంభీర్ తన పని కరెక్ట్గా చేస్తున్నారు’ అని రైనా చెప్పారు.
Similar News
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్లోని తన ఫ్లాట్లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.


