News February 18, 2025
కోటప్పకొండపై కాకులు వాలవు

కోటప్పకొండ కొండపై కాకులు వాలవు. కొండ ఎక్కుతున్నప్పుడు అనేక కాకులు దారిలో కనిపించిన కొండపైన మాత్రం ఒక కాకి కూడా మనకు కనిపించదు. భక్తురాలు గొల్లభామ ఎప్పటి లాగానే స్వామివారికి నైవేద్యంగా పాలు, పెరుగును తీసుకొని కొండ మెట్ల పైగా వస్తుంది. ఈలోగా ఒక కాకి వాలి నైవేద్యమును నేలపాలు చేసింది. దీంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని శపించిందని అప్పటి నుంచి కాకులు రావని భక్తుల నమ్మకం
Similar News
News February 25, 2026
నిర్మల్: విద్యార్థుల సామర్థ్యాలపై ‘ఎఫ్ఎల్ఎన్’ సర్వే

జిల్లాలోని ఎంపిక చేసిన 53 ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ‘ఎఫ్ఎల్ఎన్’ (FLN) శాంపిల్ సర్వే ప్రారంభమైంది. రెండో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం అంశాల్లో ఉన్న కనీస సామర్థ్యాలను అధికారులు పరిశీలించనున్నారు. సర్వే నిర్వహణకు డైట్ చాత్రోపాధ్యాయులను ఇప్పటికే నియమించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని అంచనా వేయడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యం.
News February 25, 2026
వంటింటి చిట్కాలు

* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే నీచు వాసన రాకుండా ఉంటాయి.
* తేనె ముద్దగా అయితే, కాసేపు సీసాను వేణ్ణీళ్ళలో ఉంచండి.
* ప్లాస్టిక్ డబ్బాలు వాడనప్పుడు వాటిల్లో కాస్త ఉప్పు వేసి ఉంచితే, తిరిగి వాడుకునేప్పుడు ప్లాస్టిక్ వాసన రాదు.
* ఆలుగడ్డలు (బంగాళా దుంపలు) ఉడికించేప్పుడు ఆ నీళ్ళలో రెండు చుక్కల నిమ్మరసం లేదా కాస్త వెనిగర్ వేస్తే తెల్లగా వస్తాయి.
News February 25, 2026
HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

నాంపల్లి ఎగ్జిబిషన్లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.


