News February 28, 2025
కోటప్పకొండ తిరునాళ్లలో వైసీపీ విద్యుత్ ప్రభపై దాడి

కోటప్పకొండ తిరునాళ్లలో గోనెపూడి వైసీపీ ఎలక్ట్రికల్ ప్రభపై కొందరు దాడి చేసి ప్రభకు నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొండ కింద ఏర్పాటు చేసిన 22 ఎలక్ట్రికల్ ప్రభలలో ఒకటి మాత్రమే వైసీపీ ప్రభ ఉంది. ఈ ఘటన సమయంలో వైసీపీ ప్రభ దగ్గరకు వైఎస్సార్ అభిమానులు భారీగా చేరుకున్నారు. తిరునాళ్లలో గోనెపూడి ప్రభ వద్ద జగన్ పాటలు వేయడంతో ప్రత్యర్థులు డీజే బాక్స్లను ధ్వంసం చేశారన్నారు.
Similar News
News November 10, 2025
శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.
News November 10, 2025
శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.
News November 10, 2025
గద్వాల డీసీసీ అధ్యక్ష సీటు ఎవరికి?

నడిగడ్డలో గద్వాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవిపై చర్చ నడుస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి, సెక్రటరీ సంపత్ కుమార్ పార్టీ శ్రేణుల అభిప్రాయాలు స్వీకరించారు. అధ్యక్ష పదవికి 13 మంది దరఖాస్తు చేసుకోగా, రాజీవ్ రెడ్డి, నల్లారెడ్డి, తిరుపతయ్య పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది.


