News September 30, 2024

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల UPDATES

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మొదటి రోజున అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, రూ.20, రూ.50 దర్శనాలను కల్పించనున్నారు.

Similar News

News February 19, 2026

శ్రీకాకుళం: 18-30 ఏళ్ల వారికే ఈ అవకాశం

image

నిరుద్యోగ యువతకు ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభం కానున్నాయి. టాటా క్యాపిటల్స్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ హాజరుకానున్నారని, టెన్త్ ఇంటర్ ఆపై విద్యార్హత ఉండి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు గల వారు అర్హులన్నారు.

News February 19, 2026

శ్రీకాకుళం: 18-30 ఏళ్ల ఉన్న వారికే ఈ అవకాశం

image

నిరుద్యోగ యువతకు ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభం కానున్నాయి. టాటా క్యాపిటల్స్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ హాజరుకానున్నారని, టెన్త్ ఇంటర్ ఆపై విద్యార్హత ఉండి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు గల వారు అర్హులన్నారు.

News February 19, 2026

SKLM: కన్నకొడుకుకు తలకొరివి పెట్టిన తల్లి.. PHOTO

image

శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో పెద్దకుమారుడు రాజు మృతి చెందగా, కన్నతల్లే కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. గతంలో చిన్నకుమారుడు మరణించగా తండ్రి తలకొరివి పెట్టారు. ఇప్పుడు రెండో కుమారుడు కూడా దూరమవడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై కొడుకుకు వీడ్కోలు పలికింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.