News March 17, 2025
కోటబొమ్మాళి : టెన్త్ పరీక్షలకు భయపడి విద్యార్థి పరార్

కోటబొమ్మాలి మండలంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న విద్యార్థి 10వ తరగతి పరీక్షలకు భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరీక్షలకు చదవమని ఇంట్లో మందలించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కోటబొమ్మాళి పీఎస్లో పేరెంట్స్ ఫిర్యాదు చేశామన్నారు.
Similar News
News February 14, 2026
మూడు పద్దులు.. మూడు రంగులు

గ్రే, బ్రౌన్, బ్లూ.. ఈ రంగులు ఏపీ బడ్జెట్ వేళ తారస పడుతున్నాయి. ఈ రంగుల బ్యాగుల్లో బడ్జెట్ ప్రతులను ఉంచి అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజ చేసిన తర్వాత వాటిని కేబినెట్లో ఆమోదించే నిమిత్తం సీఎం చంద్రబాబు, dy.సీఎం పవన్కు అందజేశారు. ప్రభుత్వం కొలువైన తర్వాత తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు గ్రే కలర్ బ్యాగు, తర్వాత బ్రౌన్, ఇవాళ బడ్జెట్ ప్రతులను బ్లూ కలర్ బ్యాగులో తెచ్చారు.
News February 14, 2026
సిక్కోలు ‘సిద్ధమైంది’

మహా శివరాత్రి ఉత్సవాలకు శ్రీకాకుళం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని శ్రీముఖలింగం(ముఖలింగేశ్వర స్వామి), శ్రీకాకుళం(ఉమారుద్ర కోటేశ్వరస్వామి),రావివలస(ఎండల మల్లికార్జునస్వామి), పలాస(స్వయంభూ లింగేశ్వరస్వామి), పాతపట్నం(నీలకంటేశ్వర స్వామి) ఆలయాల్లో ఆదివారం భక్తుల రద్దీ ఏర్పడనుంది. దీంతో ఆయా ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News February 14, 2026
అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

హైదరాబాద్ వేదికగా ఐఎల్ఎహెచ్ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.


