News August 16, 2024
కోటబొమ్మాళి: యువకుడు అనుమానాస్పద మృతి

విజయనగరం సమీపంలోని రాళ్లమళ్లపురం గ్రామం పరిధిలోని రైల్వే ట్రాక్పై శుక్రవారం కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీశ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. జగదీశ్ విశాఖపట్నంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు. విజయనగరం ఎందుకు రావాల్సి వచ్చిందని, హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Similar News
News February 21, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

✯టెక్కలి: చోరీ కేసుల్లో పాత నేరస్థుడి అరెస్ట్
✯క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే కూన
✯బూర్జ: ఘోర అగ్నిప్రమాదం.. 50 ఎకరాల్లో ఆస్తి నష్టం
✯శ్రీకాకుళం: మహిళ కడుపులో నుంచి 3.3 కిలోల కణితి తొలగింపు
✯శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలు ఎంత మంది రాయనున్నారంటే?
✯జిల్లాలో పలుచోట్ల అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం
News February 21, 2026
ఆమదాలవలస: అస్వస్థతకు గురై ప్రయాణికుడు మృతి

శ్రీకాకుళం నుంచి పాలకొండకు బస్సులో వెళ్తున్న ప్రయాణికుడు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. చింతాడ వద్ద బస్సును ఆపి తోటివారు, సిబ్బంది 108కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ అక్కడికి చేరుకొని ప్రయాణికుడిని 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 21, 2026
ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని అన్నారు.


