News April 14, 2025
కోటవురట్ల: మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

కోటవురట్ల మండలం కైలాసపట్నం మందుగుండు తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతులకు ఆదివారం రాత్రి పోస్టుమార్టం పూర్తయింది. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఆరు మృతదేహాలకు, పోస్టుమార్టం నిర్వహించగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తొందరగా ముగించారు.
Similar News
News February 26, 2026
బోయినపల్లి: CMO అధికారిని అంటూ మోసం.. అరెస్ట్

రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగులకు బానిసై అధిక డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. మోటార్ సైకిల్ దొంగలించిన కేసులో అరెస్టై జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పి బోయినపల్లి మిడ్ మానేరు DEE రఘుపతికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రఘుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించారు.
News February 26, 2026
సిద్దిపేట: ప్రభుత్వ బడిలో కలెక్టర్ తనిఖీ

సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన ఆమె, వంటలను మరింత రుచికరంగా సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బిర్యానీ, సాంబారు నాణ్యత మెరుగుపరచాలని, వంటగది మరియు డైనింగ్ హాల్ను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
News February 26, 2026
అసైన్డ్ భూములు లీజుకు.. ఎకరాకు ₹31 వేలు: అనగాని

AP: అసైన్డ్ భూముల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్నిచోట్ల అసైన్డ్ భూములు అవసరం. అసైన్దారుల అనుమతితో లీజుకు తీసుకుంటాం. లీజుతో వారికి ఆదాయం వస్తుంది. ఎకరాకు ₹31వేలు చొప్పున ఇస్తాం. రెండేళ్లకోసారి 5% వరకు పెంచుతాం’ అని చెప్పారు. 10వేల MW సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని, 7.5L మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు.


