News December 23, 2025
కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అత్తాపూర్కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 24, 2025
హైదరాబాద్కు ‘డబుల్’ పవర్?

HYD పాలనలో పెను మార్పులకు సర్కార్ స్కెచ్ వేస్తోంది. అడ్మినిస్ట్రేషన్ను రెండు భాగాలుగా చీల్చి, పర్యవేక్షణను పక్కాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఓఆర్ఆర్ లోపల GHMC మొత్తాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి అప్పగించి, ఆయనే కమిషనర్గానూ వ్యవహరించేలా భారీ ప్లాన్ సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ అవతల శరవేగంగా వెలుస్తున్న మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను మరొక ఉన్నతాధికారికి అప్పగించనున్నారు.
News December 24, 2025
బోరబండలో BRSను పాతిపెట్టినం: CM రేవంత్ రెడ్డి

కోస్గి సభలో BRS, KCR మీద CM రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. ‘BRSను అసెంబ్లీలో ఓడగొట్టినం. లోక్సభలో గుండు సున్నా ఇచ్చినం. కంటోన్మెంట్లో బండకేసి కొట్టినం. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ బండ కింద పాతిపెట్టినం. సర్పంచ్లను గెలిపించుకున్నాం. ఇన్ని సార్లు BRSను ఓడించినా సిగ్గులేకుండా పైచేయి మాదే అంటున్నారు. పొంకనాలు వద్దు KCR చేతనైతే అసెంబ్లీకి రండి’ అంటూ CM సవాల్ చేశారు.
News December 24, 2025
HYD: 2025లో ‘550’.. గుర్తుందా?

NEW YEAR సెలబ్రేషన్ అంటే సిటీలో బట్టలు చింపుకోవాల్సిందే. ఏజ్తో సంబంధం లేకుండా చిల్ అవుతుంటారు. ఏదైనా ఒక మోతాదు వరకు అంటే ఓకే. కానీ, 2025 న్యూ ఇయర్ మీకు గుర్తుందా?. ఓ మందుబాబు పీకలదాకా తాగి పోలీసులకు చిక్కాడు. పంజాగుట్టలో బైకర్ను ఆపి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా ఏకంగా 550 రీడింగ్ నమోదైంది. ఇది చూసి పోలీసులే షాకయ్యారు. న్యూ ఇయర్ రోజే మందుబాబు ఫొటో వైరలైంది. చిల్ అవ్వండి బ్రో.. చిల్లర అవ్వకండి.


