News February 3, 2025
కోట్ పల్లి: పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే
పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష రాజు ఎంపిక కావడంతో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి నియామక పత్రాన్ని వారికి అందజేశారు. మహిళలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు.
Similar News
News February 3, 2025
చరిత్ర సృష్టించిన రసెల్
వెస్టిండీస్ ప్లేయర్ రసెల్ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచారు. ఆయన కేవలం 5,321 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్(5,915 బంతులు) పేరిట ఉండేది. ఓవరాల్గా 9వేల పరుగులు పూర్తి చేసిన 25వ ప్లేయర్ రసెల్ కావడం గమనార్హం. 536 మ్యాచుల్లో 9,004 పరుగులు చేశారు.
News February 3, 2025
NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం
సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News February 3, 2025
IIFA అవార్డ్స్.. నామినేషన్లు ఈ చిత్రాలకే
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA)-2025కు హిందీ నుంచి నామినేషన్ల జాబితా విడుదలైంది. కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ ఏకంగా 9 విభాగాల్లో పోటీ పడుతోంది. కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రి, విద్యాబాలన్ నటించిన భూల్ భూలయ్య-3 ఏడు, స్త్రీ-2 ఆరు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. జైపూర్ వేదికగా IIFA సిల్వర్ జూబ్లీ వేడుక మార్చి 8, 9 తేదీల్లో జరగనుంది.