News October 15, 2024
కోట నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన అశోక్ గజపతి
కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఎప్పటిలాగే కోట నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సిరిమానును దర్శించుకున్నారు. అశోక్తో కలిసి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన వారిలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ నేత గొంప కృష్ణ, రాజ కుటుంబీకులు ఉన్నారు.
Similar News
News October 16, 2024
విజయనగరం డ్వాక్రా బజార్ను సందర్శించిన మన్యం జిల్లా కలెక్టర్
విజయనగరంలో ట్యాంక్ బండ్ సమీపంలో, DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ను మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చి అమ్మకాలు చేపడుతున్న మహిళా సంఘాలు సభ్యులతో మాట్లాడి ఆదాయం ఎంత వస్తుంది అనేది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, DRDA పీడీ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.
News October 15, 2024
VZM: సిరిమానోత్సవంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, శ్యాం ప్రసాద్ సందడి చేశారు. సిరిమాను రథంతో పాటు పర్యటించారు. మూడు సార్లు కూడా రథం ముందు నడిచి ముందుకు సాగారు. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికార యంత్రాంగానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 15, 2024
DCCB బ్యాంకు ఆవరణ నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన బొత్స
ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటిలాగే DCCB బ్యాంకు ఆవరణ నుంచి పైడితల్లి సిరిమానోత్సవాన్ని తిలకించారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి.. అమ్మవారి సిరిమానును భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పైడిమాంబ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా బొత్స ఆకాంక్షించారు.