News November 30, 2025

కోడేర్: అంగన్వాడీ టీచర్‌గా రాజీనామా.. సర్పంచ్‌గా పోటీ

image

కోడేరు మండలం సింగాయిపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ హరిత సర్పంచ్‌గా పోటీ చేసేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గ్రామానికి మంచి సేవ చేయాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె నిర్ణయాన్ని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 4, 2025

WGL: మొక్కజొన్న క్వింటాకి రూ.2,020

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935, మంగళవారం రూ.1,905, బుధవారం రూ.1,945 ధర వచ్చింది. నేడు రూ.2,020 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు నిన్న రూ.5,400 ధర రాగా, నేడు రూ.4,700 అయినట్లు వ్యాపారులు తెలిపారు.

News December 4, 2025

కారంపూడి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

image

కారంపూడి విద్యుత్ ఏఈ పెద్ద మస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కారంపూడికి చెందిన వలీ ఇంజినీరింగ్ వర్క్స్ వారికి అదనపు మీటర్లు కేటాయించడానికి డబ్బులు అడగడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ బాధితుడు వలి నుంచి ఏఈ రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

News December 4, 2025

నైపుణ్య లోటుపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న

image

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్‌సభలో వివరాలు కోరారు. కేవలం 3% మంది కార్మికులకే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతికతల వినియోగ వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఎఫ్‌ఐసీఎస్‌ఐ ద్వారా చర్యలు తీసుకుంటూ 60 విభాగాల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.