News September 6, 2025

కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గర్భిణికి కవలలు జననం

image

కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇచ్ఛాపురానికి చెందిన గర్భిణి భూలక్ష్మి శుక్రవారం ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. మార్గం మధ్యలో పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త జానకిరామ్ RPF సిబ్బందికి సమాచారం అందించారు. రైలును శ్రీకాకుళం స్టేషన్ వద్ద నిలిపి డాక్టర్‌ను పిలిపించారు. గర్భిణి రైలులో రైలులో ఆడ శిశువు, ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిది. తల్లి, శిశువులను ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 6, 2025

ఈనెల 8న ఎచ్చెర్ల ఐటీఐ కాలేజీలో అప్రెంటీస్ మేళా

image

ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల 8న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటీస్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌ఛార్జి సాయిబాబు శనివారం తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ 11 కంపెనీలు పాల్గొంటున్నాయని అన్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు గుర్తింపు కార్డు, 4 రెస్యూమ్ కాపీలు, ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

News September 6, 2025

SKLM: రేపు అటవీశాఖ ఉద్యోగ పరీక్ష

image

అటవీ శాఖలో పలు ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు SKLM రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదివారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరిక్షలకు తగ్గా ఏర్పాట్లు చేశామన్నారు.

News September 6, 2025

ఆముదాలవలస: అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

image

అప్పుల బాధలు తాళలేక ఆముదాలవలసకు చెందిన చిరు వ్యాపారి బరాటం తాతయ్య (57) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. తాతయ్య 3 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతను ఇంటికి రాకపోవడంతో సోషల్ మీడియాలో ఆచూకీ కోసం ప్రకటించారు. పట్టణంలోని పెద్ద చెరువు స్మశాన వాటిక వద్ద శుక్రవారం విగత జీవిగా పడిఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.