News October 15, 2025
కోదాడలో అరుదైన శస్త్రచికిత్స.. దూడకు చేప చర్మం

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశువైద్యుడు డా.పెంటయ్య జిల్లాలోనే తొలిసారిగా అరుదైన గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్స చేశారు. ఆటో ఢీకొని కాలికి తీవ్ర గాయమై చర్మం ఊడిపోయిన ఒక గేదె దూడకు ఆయన చేప చర్మాన్ని ఉపయోగించి గ్రాఫ్టింగ్ చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రైతు హర్షం వ్యక్తం చేశారు. డాక్టర్ పెంటయ్య చేసిన ఈ అరుదైన వైద్యంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News October 15, 2025
HYD: ‘సర్కారు చేతికి మెట్రో’.. రేపు కీలక నిర్ణయం

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఈ నెల16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం, సీఎస్ రామక్రిష్ణారావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ తదితరులతో సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నారు.
News October 15, 2025
జగిత్యాల : ఖాతాదారులు KYC సమర్పించాలి

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వినియోగదారులు తమ ఖాతాలకు KYC సమర్పించాలని జనరల్ మేనేజర్ తెలిపారు. కస్టమర్లు వాడని ఖాతాలను తిరిగి వాడుకునేందుకు, క్లెయిమ్ చేయని డిపాజిట్లను పొందేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. కావున ఖాతాదారులు తమ సమీప బ్రాంచ్ వెళ్లి సంబంధిత పత్రాలను అందజేయాలన్నారు. 10 సం.లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్లు భారత రిజర్వ్ బదిలీ చేయబడ్డాయి అన్నారు. వీటికోసం సంబంధిత బ్యాంక్ నుసంప్రదించాలన్నారు.
News October 15, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.