News October 15, 2025

కోదాడ: ‘ప్రతి కార్యకర్త కృషి చేయాలి’

image

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే సంగతన్ సృజన్ అభియాన్ ఉద్దేశం అని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ అన్నారు. బుధవారం కోదాడలో హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News October 16, 2025

నాడు సంతకాలు చేసిన వారే నేడు ఉన్నారు.!

image

తిరుమల శ్రీవారి పరకాణి విషయంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవికుమార్ బోర్డు సమావేశం తరువాత అనుమతి పత్రం ఇస్తే ముందే తీర్మానం చేశారని టీటీడీ బోర్డు సభ్యులు ఆరోపించారు. అయితే ఆ బోర్డులో సంతకాలు చేసిన పలువురు సభ్యులు నేటి బోర్డులో సంతకాలు చేయడం విశేషం. మరి వారిది తప్పు కదా.? వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయని భక్తులు చర్చించుకుంటున్నారు.

News October 16, 2025

474 ఇంజినీరింగ్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

UPSC 474 ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా/ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), MSc చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.200, మహిళలు, SC,ST, PwBDలకు మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://upsconline.nic.in/

News October 16, 2025

కరీంనగర్: ‘బియ్యం బుక్కేస్తున్నారు’..!

image

ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి సర్కార్‌కు అప్పజెప్పే క్రమంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిన్న శంకరపట్నం తాడికల్‌లోని రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రూ.6.73 కోట్ల 31,234 క్వింటాళ్ల CMR స్టాక్ దారి మళ్లినట్లు గుర్తించారు. PDPL 140, KNRలోని 111 రైస్ మిల్లులకు CMRకు ప్రభుత్వం ధాన్యం కేటాయించింది.