News February 25, 2026
కోదాడ: రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రావెళ్ల సీతారామయ్య

తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కోదాడకు చెందిన రావెళ్ల సీతారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కోదాడ యూనిట్, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పదవి దక్కింది.
Similar News
News March 2, 2026
TODAY TOP NEWS

* ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
* ఖమేనీ హత్యకు నిరసనగా HYD, BLR, ఢిల్లీలో నిరసనలు
* విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI
* కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN
* 2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని
* GST వసూళ్లలో ఏపీ, తెలంగాణ దూకుడు
* సీఎం రేవంత్కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి
* T20WC సెమీస్కు దూసుకెళ్లిన భారత్
* ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర
News March 2, 2026
HYDలో హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచులు

TG: హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. FIH&హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ వీటిని హోస్ట్ చేయనుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ పాల్గొననున్నాయి. భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే టీమ్లు ఇప్పటికే HYD చేరుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టోర్నీ HYDలో జరగడం ఇదే తొలిసారి.
News March 2, 2026
నల్గొండలో పర్యటించనున్న మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు నల్గొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకు నాగార్జున సాగర్ బుద్దవనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు.


