News February 1, 2025
కోనరావుపేట: ఈత చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడికి గాయాలు

కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన ఏగోలపు మల్లేశం గౌడ్ శుక్రవారం ఈత చెట్టు నుంచి పడి గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన మల్లేశం గౌడ్ ఈత చెట్టు ఎక్కుతుండగా మోకుజారి కింద పడిపోయాడు. దీంతో గాయాలైన గీత కార్మికున్ని తోటి కార్మికులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మల్లేశం గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదుకోవాలని కుటుంబ సభ్యులు గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News February 24, 2026
911 ప్రభుత్వ ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) 911 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE/BTech(సివిల్ Engg.), డిప్లొమా(సివిల్ Engg.), డిగ్రీ అర్హతతో పాటు వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి. దరఖాస్తు ఫీజు ₹100. SC, ST, PwBDలకు ఫీజు లేదు. రెండు దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు ₹35,400 నుంచి ₹1,42,400.
News February 24, 2026
అనకాపల్లి: గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కె.నానాజీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాకినాడ జిల్లా తునిలో సైకిల్ షాప్ నిర్వహిస్తున్న నానాజీకి పక్కనే ఉన్న బైక్ మెకానిక్ రాజుకు ఈనెల 18న గొడవ జరిగింది. దీంతో రాజు, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తుని సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.
News February 24, 2026
100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, 10 కేజీల యూరియా?

AP: రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజమండ్రిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ కల్తీ పాల దందా కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. 100 లీటర్ల పాలలో 100 లీటర్ల నీరు, తెల్లటి నురగ కోసం 10 కేజీల యూరియా, మరికొన్ని రసాయనాలు కలుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


