News December 15, 2025
కోనసీమ: కొబ్బరి రైతులకు కేంద్రం తీపి కబురు

కొబ్బరికి మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. మిల్లింగ్ కొబ్బరికి క్వింటా రూ.445, బంతి కొబ్బరికి రూ.400 మద్దతు ధర పెంచారు. ఈ పెంపుతో మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా రూ.12,027, బంతి కొబ్బరి ధర రూ.12,500కు పెరిగింది. జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయి. మద్దతు ధర పెంపుతో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News December 17, 2025
పెనమలూరు ORRతో అభివృద్ధికి ఊపు.!

పెనమలూరు పరిధిలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో అభివృద్ధి వేగవంతం కానుంది. కంకిపాడు-ఉయ్యూరు సరిహద్దులో 25 K.M మేర విస్తరించే ఈ ORR భూసేకరణ కోసం సర్వే నంబర్ల గుర్తింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. మారేడుమాక, కోలవెన్ను సహా 8 గ్రామాల్లో 778 కమతాలను గుర్తించారు. దావులూరు-నెప్పల్లి హైవేకు అనుసంధానంగా ఈ ORR రూట్ ఏర్పాటు కానుంది.
News December 17, 2025
100 రోజుల స్టడీ ప్లాన్ ఓకే.. పిల్లల ఆకలి మరీ.?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల మంది పదో తరగతి విద్యార్థులకు DEC 6నుంచి 100రోజుల స్టడీ ప్లాన్ అమలు చేస్తున్నారు. స్కూల్ సమయం తర్వాత కూడా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు రాత్రి 7గ.ట వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం ఏమీ తినకపోవడంతో విద్యార్థులు నీరసించి, చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయంత్రం వేళ పాలు, టిఫిన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News December 17, 2025
ఆసుపత్రిలో చేరిన జైస్వాల్

టీమ్ ఇండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఆసుపత్రిలో చేరారు. SMATలో ముంబై తరఫున ఆడుతున్న ఆయన రాజస్థాన్తో మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారు. దీంతో పుణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. జైస్వాల్ గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, వైద్యపరీక్షలు నిర్వహించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా నిన్నటి మ్యాచులో ముంబై 3 వికెట్ల తేడాతో గెలిచింది.


