News March 23, 2024
కోనసీమ: జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ నేపథ్యం ఇదే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711195684694-normal-WIFI.webp)
పి.గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ఈ ఏడాది జనవరి 31న స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన సత్యనారాయణ సీఆర్ రెడ్డి కళాశాలలో బీఏ, బీఎల్ చదివారు. 1961 మే 15న జన్మించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరి పి.గన్నవరం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.
Similar News
News July 5, 2024
తూ.గో.: మద్యం మత్తులో యువతిపై బ్లేడుతో దాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720166778029-normal-WIFI.webp)
తూ.గో. జిల్లా గోకవరం మండలకేంద్రంలో శుక్రవారం దారుణం జరిగింది. తంటికొండ వెళ్లే దారిలోని అరవపేటలో ఉంటున్న గుర్తుతెలియని వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపై మతిస్థిమితం లేని యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతి పరుగులు తీస్తుండగా బ్లేడుతో ఆమె చేతిపై, ముఖంపై దాడి చేసాడు. స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొని స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తి గత కొంత కాలంగా స్మశానంలో జీవిస్తున్నాడు.
News July 5, 2024
రేపు CMల భేటీ.. తెరపైకి ఆ 5 గ్రామ పంచాయతీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720151741615-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు HYDలో శనివారం భేటీ కానున్నారు. ప్రస్తుతం భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా మిగిలినవి AP పరిధిలో ఉన్నాయి. ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. రేపు ఇద్దరు CMల భేటీ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరుగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.
News July 5, 2024
మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వ్యక్తి అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720134979104-normal-WIFI.webp)
రాజమండ్రిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచారరథం దహనం కేసులో వీఎల్ పురానికి చెందిన దంగేటి శివాజీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తూర్పు మండల డీఎస్పీ కిషోర్ గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కోసం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.