News February 28, 2025
కోనసీమ: ‘జాతీయ లోక్ అదాలత్ జయప్రదం చేయాలి’

రామచంద్రపురం పట్టణంలో గురువారం అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో రామచంద్రపురం 13వ అదనపు జిల్లా సెషన్స్ కోర్ట్ జడ్జి ఎన్. శంకరరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను జయప్రదం చేయాలని పేర్కొన్నారు. గతంలో రామచంద్రపురం నుంచి ఎక్కువ సంఖ్యలో లోక్ అదాలత్కు కేసులు వచ్చేలా న్యాయవాదులు సహకరించారని అన్నారు. ఆ పరంపర కొనసాగాలన్నారు.
Similar News
News December 30, 2025
NTR: డబ్బులు వసూలు చేసి తెస్తుండగా ప్రమాదం..!

ఎలమంచిలి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో 2 భోగీలు కాలిపోవడంతో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) మృతి చెందిన విషయం తెలిసిందే. అతని వద్ద ఉన్న బ్యాగులో రూ.6 లక్షల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను హోల్ సేల్ వస్త్ర వ్యాపారి అని, విజయనగరం నుంచి డబ్బులు వసూలు చేసుకుని విజయవాడకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తుని ప్రభుత్వ రైల్వే ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.
News December 30, 2025
ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>
News December 30, 2025
హమాస్కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.


