News March 25, 2025

కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: జేసీ

image

రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగులతో ఆమె మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ పరిపాలన అంశాలపై ఫైలింగ్ నిర్వహణ విధివిధానాలు పట్ల వారికి ఆమె అవగాహన కల్పించారు. భూ సంబంధిత సమస్యలపై తహశీల్దారులు, ఆర్డీవోలు విచారణ జరిపి కలెక్టరేట్‌కు నివేదిక అందించాలన్నారు.

Similar News

News November 9, 2025

ఆముదపు విత్తులు ముత్యాలవుతాయా?

image

ఒక వస్తువు లేదా వ్యక్తి సహజ స్వభావం ఎప్పటికీ మారదు. ఆముదపు విత్తనాలు ఎప్పటికీ ఆముదపు విత్తనాలుగానే ఉంటాయి, అవి విలువైన ముత్యాలుగా మారవు. అలాగే దుర్మార్గులైన లేదా చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తులు వారి ప్రవర్తనను మార్చుకోరని చెప్పడానికి.. సహజంగా జరగని లేదా అసాధ్యమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News November 9, 2025

కార్తీకంలో ఏ దానం చేస్తే ఏ ఫలితం?

image

దీప దానం చేస్తే అజ్ఞానం తొలగిపోతుంది.
అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది.
వస్త్ర దానం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.
స్వయంపాకం దానమిస్తే గౌరవం పెరుగుతుంది.
ఉసిరికాయలు దానం చేస్తే శుభం కలుగుతుంది.
గోదానంతో కృష్ణుడి కృప మీపై ఉంటుంది.
తులసి దానం చేస్తే మోక్షం లభిస్తుంది.
ధన దానం చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది.
పండ్లను దానం చేస్తే సంతానం కలుగుతుంది.

News November 9, 2025

లాంచీలో శ్రీశైలం యాత్ర

image

TG: కృష్ణా నదిలో నల్లమల అందాలను వీక్షిస్తూ నాగర్‌కర్నూల్(D) సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర పున:ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో భక్తులు సోమేశ్వరుడిని దర్శించుకున్నాక 9AMకు లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. నిర్వాహకులు భోజనం, స్నాక్స్ అందిస్తారు. వన్ సైడ్ జర్నీకి పెద్దలకు ₹2000, పిల్లలకు ₹1600 వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు https://tgtdc.in/లో చూడగలరు.