News July 27, 2024
కోనసీమ: విద్యుత్ సమస్యలపై మంత్రికి ఎమ్మెల్యే వినతి

రాజోలు నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో విద్యుత్ కొరతతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి గుడిమెళ్లంక, గుడిమూలలో విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని, లక్కవరం, రాజోలు సబ్ స్టేషన్ల కెపాసిటీని 5ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకు పెంచాలని కోరారు.
Similar News
News February 16, 2026
రాజమండ్రి: పోలీస్ పీజీఆర్ఎస్కు 24 ఫిర్యాదులు

రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 24 మంది తమ అర్జీలను దాఖలు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై సంబంధిత స్టేషన్లకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
News February 15, 2026
రాజమండ్రి: గమనిక.. రేపు రెవెన్యూ క్లినిక్లు రద్దు

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తదుపరి రోజూ 16న రాష్ట్ర ప్రభుత్వం ఐచ్చిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన PGRS/ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు అందజేయడానికి సంబంధిత కార్యాలయాలకు రావద్దని అర్జీదారులను కోరారు. తదుపరి సోమవారం నుండి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
News February 14, 2026
ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: కందుల

సీఎం నారా చంద్రబాబు దిశానిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ రాష్ట్ర పురోగతికి బాటలు వేసేలా ఉందని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. శనివారం అమరావతిలో ఆయన మాట్లాడారు. పర్యాటక, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్లో రూ.439 కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది సమగ్రమైన బడ్జెట్ అని రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి పురోగమన దిశలో వెళ్తుందన్నారు.


