News March 9, 2025

కోరుకొండ: ఎత్తైన గిరిపై నరసింహుడు (PHOTO)

image

రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎత్తైన గిరిపై కొలువై ఉంది. ఇది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దగ్గర్లో ఉంటుంది. నరసింహస్వామిని దర్శించుకోవటానికి నడకమార్గంలో సుమారు 615 మెట్లు ఎక్కాలి. చుట్టూ పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్లారా.. కామెంట్ చేయండి.

Similar News

News March 9, 2025

రాజమండ్రి: సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

image

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఇకపై ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చశారు. ఈ మేరకు గతంలో మాదిరిగానే ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలియచేశారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News March 9, 2025

నెల్లూరులో నలుగురు దేవరపల్లి వాసులు అరెస్టు

image

రాగితీగలు, BSNLకు చెందిన వస్తువులు చోరీ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేయగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్య, దుర్గారావు, సింహాద్రి, నరసయ్యను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

News March 9, 2025

తూ.గో: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఏఆర్ ఎస్ఐ మృతి

image

ఆటో ఢీకొని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రిలోని స్వరూప్ నగర్‌కు చెందిన విశ్రాంత ఏఆర్‌ SI త్రిమూర్తులు (65) శనివారం మృతిచెందాడు. బొమ్మూరు ఎస్ఐ ప్రియకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆయన స్కూటీపై వెళుతుండగా శ్రీరామ్‌పురం ఫారెస్టు రోడ్డులో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన త్రిమూర్తులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు.

error: Content is protected !!