News October 24, 2025

కోరుట్లలో గంజాయి మొక్కలు.. ముగ్గురి రిమాండ్

image

కోరుట్ల హాజీపూర్‌లో తుమ్మ చెట్ల మధ్య గంజాయి మొక్కలను పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన బోలా శంకర్(27), కైలాస్ కుమార్(29), సన్నీ(26) అనే ముగ్గురు వ్యక్తులను పట్టుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సురేష్ బాబు, SI చిరంజీవి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 90,000ల విలువగల 9 గంజాయి మొక్కలను, 2 మొబైల్ ఫోన్లను వీఆర్ఏ, అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు పంపామని పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

28న ప్రజా ఉద్యమం: భూమన

image

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న ‘ప్రజా ఉద్యమం’ చేపట్టనున్నట్లు వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

News October 24, 2025

ఇవాళ భారత్ బంద్

image

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.

News October 24, 2025

ప్రకాశం జిల్లాలోని పత్తి సాగు రైతులకు గుడ్ న్యూస్

image

జిల్లాలోని పత్తి సాగు రైతులకు JC గోపాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు జేసీ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. మార్కాపురంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు ఆయన నిర్ణయించారు. నవంబర్ నుంచి పత్తి పంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జిల్లాలోని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదలైంది. ఈ క్రాప్ చేయించుకున్న రైతులు మాత్రమే అర్హులుగా తెలిపారు.