News July 10, 2025

కోరుట్ల: గరుడ వాహనంపై విహరించిన వేంకటేశ్వరుడు

image

గురు పూర్ణిమ సందర్భంగా కోరుట్లలోని అతిపురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో గరుడ సేవా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా తిరుమలలో జరిగే విశేష పూజలను కోరుట్లలో స్వామివారికి చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం పురవీధుల్లో గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగించారు.

Similar News

News July 11, 2025

ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

image

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు

News July 11, 2025

బిజినెస్ అప్‌డేట్స్

image

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు

News July 11, 2025

ఉమ్మడి విశాఖలో పొలిటికల్ హీట్

image

ఉమ్మడి విశాఖలో పొలిటికల్ హీట్ రాజుకుంది. జడ్పీ ఛైర్పపర్సన్ సుభద్ర పనితీరుపై అసంతృప్తితో ఉన్న 22 మంది ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. అసంతృప్తిలో ఉన్న ZPTCలతో బొత్స సత్యనారాయణ విశాఖ క్యాంప్ ఆఫీసులో నేడు సమావేశం కానున్నారు. వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం.