News October 13, 2025

కోరుట్ల: వాహనం ఢీ కొని వ్యక్తి దుర్మరణం

image

కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీ కొని కోరుట్లకి చెందిన మారుపాక వినోద్ (28) అక్కడిక్కడే మృతిచెందాడు. వినోద్ పై నుంచి వాహనం వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలోనే కారు, బైక్ ఢీకొని ఒకరు చనిపోగా 24 గంటలు గడవక ముందే మరో ప్రమాదం జరిగింది.

Similar News

News October 14, 2025

TODAY HEADLINES

image

* మోదీతో చంద్రబాబు భేటీ.. కర్నూలు, విశాఖకు ఆహ్వానం
* సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు హెల్త్ చెకప్‌లు: సీఎం రేవంత్
* అమరావతిలో CRDA భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు
* కరూర్ తొక్కిసలాటపై CBI విచారణ: సుప్రీంకోర్టు
* ఇజ్రాయెల్ బందీల విడుదల.. ట్రంప్‌, నెతన్యాహును ప్రశంసించిన మోదీ
* AP: సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

News October 14, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు

image

హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఅవుట్లలో పార్కులు, డెడ్ ఎండ్ రోడ్ల కబ్జాలు, వరద కాలువల మలుపులు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ప్రభావంపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించామన్నారు.

News October 14, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు

image

హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. లేఅవుట్లలో పార్కులు, డెడ్ ఎండ్ రోడ్ల కబ్జాలు, వరద కాలువల మలుపులు ప్రధాన అంశాలుగా ఉన్నాయన్నారు. రావిర్యాల పెద్ద చెరువు ప్రభావంపై ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగించామన్నారు.