News December 25, 2025
కోలుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం <<18656274>>జ్వరంతో<<>> బాధపడుతూ పులివెందులలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసింది. గురువారం కోలుకొని క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. పులివెందులలోని స్థానిక సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
సరస్వతి దేవి వీణానాదం – మనసుకు అమృతం

చదువుల తల్లి సరస్వతీ దేవి చేతిలో వీణ ఉంటుంది. అందులో నుంచి వచ్చే సప్తస్వరాల తరంగాలు మన మెదడులోని నరాలను ఉత్తేజపరుస్తాయి. రోజూ శాస్త్రీయ సంగీతం వింటే మనస్సు ప్రశాంతంగా మారి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ఈ నాదం విద్యార్థులకు, మేధావులకు ఎంతో మేలు చేస్తుంది. దైవత్వం అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన జీవనశైలిని మెరుగుపరిచే ఒక గొప్ప విజ్ఞానం కూడా!
News January 2, 2026
త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్లో ఉండే AEలకు ల్యాప్టాప్లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.
News January 2, 2026
కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.


