News May 31, 2024

కోసిగిలో వ్యక్తి మృతి

image

కోసిగి మండలంలోని దొడ్డి గ్రామానికి చెందిన అడివప్ప(48) గ్రామ శివారులోని మాలబండ వద్ద మృతి చెందాడు. భార్య తెలిపిన వివరాల మేరకు కోసిగిలో కట్టెల మిషన్‌లో పనిచేసేవాడని తెలిపింది. రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్నాడని, పక్కనే బైకుకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆరోపించారు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. 

Similar News

News October 6, 2024

కర్నూలు: టెట్ పరీక్షకు 256 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో ఆదివారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. పరీక్షకు మొత్తం 2,435 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 256 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. టెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు.

News October 6, 2024

కర్నూలు: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం విద్యార్థి ఎంపిక

image

కర్నూలు ఆదర్శ విద్యా మందిరంలో ఈ నెల 2, 3వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం గురుకులం బాలిక జ్యోతి ఎంపికైంది. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయురాలు లావణ్య ఆదివారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల జ్యోతిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.

News October 6, 2024

నంద్యాల: టైరు పేలి గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా

image

బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. బనగానపల్లె నుంచి యనకండ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.