News March 25, 2024

కోసిగి: వడదెబ్బతో రైతు మృతి

image

వడదెబ్బ తగిలి అయ్యన్న అనే రైతు మృతి చెందిన ఘటన కోసిగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కోసిగిలోని 2వ వార్డుకు చెందిన అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పొలం పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులున్నారు.

Similar News

News February 6, 2025

ఓర్వకల్లు దగ్గర ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు వద్ద ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మృతులు జానకి(60), విహారిక(4)గా గుర్తించారు. తిరుమల దర్శనం చేసుకుని తిరిగి రాయచూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

TG భరత్‌కు 15వ ర్యాంకు

image

మంత్రుల పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు కేటాయించారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత డిసెంబర్ వరకు ఫైళ్లను త్వరగా క్లియర్ చేసిన వారికి మెరుగైన ర్యాంకు లభించింది. ఈక్రమంలో కర్నూలుకు చెందిన మంత్రి టీజీ భరత్‌‌కు 15వ ర్యాంకు లభించింది. నంద్యాలకు చెందిన ఫరూక్‌కు మొదటి ర్యాంకు, బనగానపల్లెకు చెందిన బీసీ జనార్దన్ రెడ్డి 9వ ర్యాంకు లభించింది.

News February 6, 2025

‘కోడుమూరు మాజీ MLAపై చీటింగ్ కేసు పెడతాం’ 

image

కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని అదే పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నిధులను మురళీకృష్ణ దారి మళ్లించే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, నేతల కళ్లుగప్పి ఆయన తన సొంత సొసైటీ ఏర్పాటు చేసి నిధులు కాజేయాలని చూశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అని లక్ష్మీ నరసింహ చెప్పారు. 

error: Content is protected !!