News October 28, 2025
కోస్తాంధ్ర కలెక్టర్లకు హోం మంత్రి ఫోన్

మొంథా తుఫాను ప్రభావం వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం ఉదయం కోస్తాంధ్ర జిల్లాలోని కలెక్టర్లతో ఆమె నేరుగా మాట్లాడారు. తుఫాన్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఏకైక లక్ష్యమని చెప్పారు. ఎప్పటికప్పుడు నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.
Similar News
News October 28, 2025
తూ.గో: సార్.. ఈ సమస్యలను పరిష్కరించండి

తుఫాన్ నేపథ్యంలో ఉమ్మడి తూ.గో జిల్లా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చాలా ఏరియాల్లో మంగళవారం ఉదయం నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ‘మీ ఏరియాలో కరెంట్ ఉందా? లేదా?’ అంటూ Way2Newsలో ప్రచురితమైన వార్త కింద <<18131522>>కామెంట్ల <<>>రూపంలో ప్రజలు తమ సమస్యలను వివరించారు. వీటిపై ఆయా ప్రాంతాల అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
News October 28, 2025
మొంథా తుపాన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఎర్ర హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ తీవ్ర వాయుగుండంగా బలపడింది. తుపానుగా మారి గంటకు 90 నుంచి 110 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లికి రెడ్ అలెర్ట్ జారీ కాగా.. వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
News October 28, 2025
SRPT: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.


