News February 9, 2025
కౌటాలలో పదో తరగతి విద్యార్థిని సూసైడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739080489034_1043-normal-WIFI.webp)
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌటాలలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ వివరాల ప్రకారం.. మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హనీస్ఫూర్తి స్టడీ మెటీరియల్ కోసం మొబైల్ ఫోన్ అడగ్గా తల్లి నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 10, 2025
ఇచ్చోడ: 53 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739177548929_20476851-normal-WIFI.webp)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 1972-73 10వ తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 23 మంది విద్యార్థుల్లో 7గురు మరణించగా మిగిలిన 17 మంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం విశేషం. పాఠాలు చెప్పిన గురువులలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు పోశెట్టిని సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
News February 10, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739160751181_16876240-normal-WIFI.webp)
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 10, 2025
ADB: జిల్లాలో MPTC, ZPTC స్థానాలు ఇవే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739163594906_51600738-normal-WIFI.webp)
ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ, సర్పంచ్ 473, వార్డులు 3,834 స్థానాలు ఉన్నాయి. ఈ నెల 11న పోలీంగ్ కేంద్రాల ముసాయిదా విడుదల కానుంది. కాగా ఈ నెల 15 లోపు ఎన్నికల సిబ్బందికి శిక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.