News March 15, 2025

కౌటాల: గ్రూప్-3లో 3వ ర్యాంకు 

image

కౌటాల మండలం గుడ్లబోరికి చెందిన కామ్రే భాస్కర్ ఇటీవల విడుదల చేసిన <<15731644>>గ్రూప్-2లో 381మార్కులతో 229 ర్యాంకు సాధించారు.<<>> కాగా నిన్న విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లోనూ 296.1 మార్కులతో 154వ ర్యాంకు సాధించారు. 2016లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన భాస్కర్ ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా వున్నారు. చిన్ననాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పోటీ పరీక్షలకు సిద్ధమైనట్లు తెలిపారు.

Similar News

News March 15, 2025

ఆ హీరో కోసమే ప్రత్యేక పాటలో డాన్స్ వేశాను: గుత్తా జ్వాల

image

హీరో నితిన్ కోసమే తాను ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ప్రత్యేక గీతం చేశానని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఆ సినిమా కంటే ముందు నాకు చాలా సినిమా ఛాన్సులు వచ్చినా ఒప్పుకోలేదు. నితిన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని అడిగాడు. నాకు ఆసక్తి లేకపోయినా తన ఒత్తిడి వల్లే ఆ సాంగ్ చేశాను. ఆ పాట తన సినిమాకు హెల్ప్ అయింది’ అని గుర్తుచేసుకున్నారు.

News March 15, 2025

BRS హయాంలో కంటే మా పాలనలోనే ఎక్కువ రుణమాఫీ: భట్టి

image

TG: KCR, హరీశ్ రావు, KTR సొంత నియోజకవర్గాల్లో BRS హయాంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే ఎక్కువ రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గజ్వేల్‌లో అప్పట్లో రూ.104 కోట్ల రుణ‌మాఫీ జరిగితే ఇప్పుడు రూ.237 కోట్లు, సిద్దిపేట‌లో గతంలో రూ.96 కోట్ల మాఫీ అయితే తమ పాలనలో రూ.177 కోట్లు, సిరిసిల్ల‌లో అప్పుడు రూ.101 కోట్లు మాఫీ చేస్తే తాము రూ.175 కోట్ల మాఫీ చేసినట్లు వెల్లడించారు.

News March 15, 2025

విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

image

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.

error: Content is protected !!