News August 25, 2025

కౌడిపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 25, 2025

మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

image

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News August 24, 2025

MDK: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

చిన్నశంకరంపేటలోని మహాత్మా గాంధీ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంభాషించారు. ఒక ఉపాధ్యాయుడిలా తరగతి గదిలో వారికి పలు ప్రశ్నలు వేశారు. అనంతరం, భోజనాన్ని పరిశీలించి, వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తాజా కూరగాయలు వాడాలని, వంటగదిలో శుభ్రత పాటించాలని వారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

News August 24, 2025

MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

image

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.