News February 3, 2025
క్యాన్సర్ లక్షణాలు ఉంటే పరీక్షించుకోవాలి: దేశ్ పాండే

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, న్యాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి దేశ్ పాండే మాట్లాడుతూ.. రోజురోజుకూ వివిధ రకాలైన క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షించుకోవాలని, తద్వారా నయం చేయవచ్చన్నారు.
Similar News
News December 10, 2025
బొదులూరు పీహెచ్సిని ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటీడీఏ పీవో

మారేడుమిల్లి మండలంలోని బొదులూరు పీహెచ్సిని రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందుతుందా, వైద్య పరీక్షలు చేస్తున్నారా అనే వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.
News December 10, 2025
కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News December 10, 2025
టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.


