News October 3, 2025
క్యారవాన్ టూరిజన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు: కలెక్టర్

జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీలించారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రానున్న రోజుల్లో నూతన వరవడిని చూపుతుందన్నారు. క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ బస్సు సూర్యలంక బీచ్లో శని, ఆదివారం అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News October 3, 2025
ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

APలో రేపు ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. అటు TGలో ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, HNK, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News October 3, 2025
శ్రీశైలం, శ్రీకాళహస్తి పాలకమండళ్లు ఏర్పాటు

AP: ప్రముఖ పుణ్యక్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తికి 16మంది చొప్పున పాలకమండలి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం <
News October 3, 2025
సంగారెడ్డి రూరల్ ఎస్సై సస్పెండ్

సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్పై ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. ఓ కేసు విచారణలో ఎస్సై లంచం డిమాండ్ చేయడంతో పాటు, ఆయన వేధింపుల వల్లే లోకేష్ మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. దీంతో మల్టీజోన్-2 ఐజీ ఆదేశాలతో ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో అవినీతి వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.