News December 25, 2025
క్యాలెండర్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 27, 2025
ప్రొద్దుటూరు: నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,400
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.13,248
* వెండి 10 గ్రాములు ధర రూ.2,530
News December 27, 2025
కడప: ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు నోటీసులు.!

జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫేజ్ -3 ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వారు లబ్ధిదారుల నుంచి, ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా వదిలేశారు. దీనిపై అధికారులు పరిశీలన జరిపి సంబంధిత సిబ్బందికి జీతాలు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. వ్యతిరేకత రావడంతో కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చారు.
News December 27, 2025
కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.


