News January 3, 2025
క్యాలెండర్లను ఆవిష్కరించిన మంత్రి కొండా

సచివాలయంలో తెలంగాణ బయో డైవర్సిటి బోర్డ్ నూతన క్యాలెండర్లను అధికారులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అంతకుముందు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మంత్రిని కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పిసిసిఎఫ్(హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, తెలంగాణ బయోడైవర్సిటి బోర్డు ఛైర్మన్ కాళిచరణ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 5, 2025
ఎస్సీ విద్యార్థులకు గుడ్న్యూస్: రూ.3,500 స్కాలర్షిప్

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్షిప్ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్సైట్లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.
News November 4, 2025
వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News November 4, 2025
ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.


