News March 11, 2025
క్యూట్.. Pic Of The Day

కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడించారు. పర్యటన ముగించుకుని వెళ్తున్న క్రమంలో తన కాన్వాయ్ వద్దకు అభిమానులు చిన్నారిని తీసుకొచ్చారు. ఆయన చిన్నారిని ఎత్తుకుని ముద్దాడారు. ఇందుకు సంబంధించిన క్యూట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డే అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
Similar News
News April 1, 2026
ఏలూరు: గ్యాస్ సిలిండర్ కావాలా..మీకు అయితే రూ.1,800లే

ఏలూరు జిల్లాలోని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ దందా నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా తమకు గ్యాస్ సిలిండర్ అందడం లేదని, బ్లాకులో అయితే రూ.1,800లకు సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని, తాము బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 1, 2026
ఒంటిమిట్ట: కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, టీటీడీ జేఈవో వీ.వీరబ్రహ్మం మంగళవారం పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.
News April 1, 2026
అమరావతికి చట్టబద్ధత.. నేడే పార్లమెంట్లో బిల్లు

ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.


