News November 3, 2025

క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ పెంచిన ICC ఉమెన్ వరల్డ్ కప్

image

ICC ఉమెన్స్ WC విజయంతో INDIA TEAMలోని క్రీడాకారిణుల బ్రాండ్ వాల్యూ 35% పెరిగింది. దీంతో పర్సనల్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ రంగాలూ వారి కోసం వెతుకుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే బ్రాండ్ ముద్రపడాలంటే వారు కనీస పరిమితి దాటాలని రెడిఫ్యూజన్ ఛైర్మన్ సందీప్ తెలిపారు. PV సింధును 90% గుర్తించడం లేదని, గిల్ ఫొటోతోపాటు పేరూ పెట్టాల్సి వస్తోందన్నారు.

Similar News

News November 4, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

నేడు కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, ATP, చిత్తూరు, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని APSDMA పేర్కొంది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, HYD, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని HYD IMD తెలిపింది.

News November 4, 2025

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న జగన్

image

AP: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ నేడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు మీదుగా కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు. ఆ ప్రాంతంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతుల్ని పరామర్శిస్తారు. తర్వాత అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

News November 4, 2025

ప్రతిరోజు ఈ హనుమాన్ మంత్రం పఠిస్తే..

image

‘ఓం పవన సుత హనుమాన్ కీ జై’ అనే మంత్రాన్ని నిత్యం జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా అనూహ్యమైన శక్తి సొంతమవుతుందని అంటున్నారు. ఈ శక్తిమంతమైన మంత్రాన్ని రోజూ 108 సార్లు ఉచ్చరించడం వలన మనోబలం, ధైర్యం పెరుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ జపం వలన తక్షణ ఫలితాలు రావడంతో పాటు, సమస్త భయాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హనుమంతుని కృపతో అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆశిద్దాం.