News January 2, 2026

క్రికెట్ టోర్నమెంట్‌కు కెప్టెన్ దీపికకు ఆహ్వానం

image

మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం భారత బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ దీపిక అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో అగళి ప్రీమియర్ లీగ్ (APL) నిర్వాహకులు గోవిందరాజు, రవి కెప్టెన్ దీపికను కలిసి ఈ సంక్రాంతికి అగళిలో నిర్వహించనున్న APL సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆహ్వానించారు. అనంతరం దీపికకు పుష్పగుచ్ఛం, అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 20, 2026

నత్తల నివారణకు విషపు ఎరను ఎలా తయారు చేయాలి?

image

ఈ నత్తలను విషపు ఎరను కూడా వాడి నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి 25 కిలోల తవుడు, 3 కిలోల బెల్లం, థయోడికార్బ్ 100 గ్రాములు, ఆముదం నూనె 100ML కలిపి చిన్న ఉండలుగా చేసి పొలాల్లో అక్కడక్కడా వేయాలి. వీటిని తిన్న నత్తలు మరణిస్తాయి. అంతేకాకుండా 1.5 లీటర్ల నీటిలో పొగాకు కాడెలను (50 గ్రా.) ఉడకబెట్టి చివరగా 60 గ్రా. కాపర్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసి నత్తలను నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News February 20, 2026

ప్రకాశం: బీటెక్ విద్యార్థి మృతి

image

ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో విషాదం నెలకొంది. మంగపతివారిపాలెం గ్రామానికి చెందిన మల్లెబోయిన శ్రీచరణ్ వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చాడు. గురువారం సాయంత్రం కాలేజీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పొలాల్లో ఉన్న తండ్రికి ఈ విషయం చెప్పడానికి వెళ్లాడు. తిరిగి వస్తూ మధ్యలో ఈతకు దిగి మృతిచెందాడు.

News February 20, 2026

ఉదయం పూట ఖర్జూరాలు తింటే..

image

ఉదయం లేవగానే ఖర్జూరాలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది. గర్భిణులు, పిల్లలకు రెగ్యులర్‌గా ఇవ్వాలని, రాత్రిపూట నీళ్లు లేదా పాలలో నానబెట్టి ఉదయం తింటే రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని వివరించారు.