News February 9, 2025

క్రికెట్ టోర్నమెంట్‌లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం

image

ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్‌మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.

Similar News

News July 6, 2025

తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

image

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.

News July 6, 2025

పల్నాడు: చుక్కల భూములపై కలెక్టర్ ఆదేశాలు

image

పల్నాడు జిల్లాలోని చుక్కల భూములపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూమిపై తగిన ఆధారాలు చూపిన రైతుల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News July 6, 2025

SRCL: కుమార్తె వైద్యానికి అప్పులు.. తీర్చలేక తండ్రి సూసైడ్!

image

వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన కుమ్మరి పోచయ్య(65) ఆర్థిక ఇబ్బందులతో తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ఆయన కుమార్తె తిరుమల(25) చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన అతడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.