News March 23, 2025
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చర్యలు: అన్నమయ్య SP

క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఎస్పీ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మ్యాచ్ను చూసి ఆనందించాలన్నారు. అంతకు మించి బెట్టింగులకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
Similar News
News February 21, 2026
తొలి తెలుగు శిలా శాసనం.. చూశారా?

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కడపలోని(AP) సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో ప్రదర్శించిన తొలి తెలుగు శిలా శాసనం నమూనా స్థూపం ఫొటో నెట్టింట వైరలవుతోంది. క్రీ.శ.575 కాలానికి చెందిన ఈ రేనాటి చోళుల శాసనం.. తెలుగు భాష ప్రాచీనతకు సజీవ సాక్ష్యం. మాతృభాషపై మమకారంతో పలువురు ఈ ఫొటోను షేర్ చేస్తూ మన భాషా వారసత్వాన్ని ఘనంగా చాటుతున్నారు. మన భాషకు ‘ప్రాచీన హోదా’ రావడంలో ఇటువంటి శాసనాలే కీలక పాత్ర పోషించాయి.
News February 21, 2026
260 పోస్టులు.. అప్లై చేశారా?

<
News February 21, 2026
ఎందుకలా?!: గాలి మనకు కనిపించదు..

ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుందంటే దానిపై కాంతి పడి పరావర్తనం(రిఫ్లెక్షన్) చెందిందని అర్థం. అటు ఏ పదార్థం/వస్తువు ఏర్పడాలన్నా అణువుల కలయిక అవసరం. అయితే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వంటి గ్యాసెస్ అణువులున్నా కనిపించకపోవడానికి కారణం వాటి నిర్మాణం. అవి చాలా సూక్ష్మంగా, పారదర్శకంగా ఉంటాయి. దీంతో వాటిపై కాంతి పడినా రిఫ్లెక్ట్ చేయలేవు. ఫలితంగా గాలిని చూడలేం. ప్రతిరోజూ 2pmకు ఇలా ఓ కొత్త విషయం ఎందుకలా?!లో.


