News August 25, 2025

క్రిష్ణగిరి: ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బాబాయి, అబ్బాయి

image

క్రిష్ణగిరి మండలంలోని మారుమూల గ్రామం బి.ఎర్రబాడులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కలుగొట్ల మల్లికార్జున ఎస్జీటీ టీచర్ ఉద్యోగం పొందగా, ఆయన అబ్బాయి కలుగొట్ల మంజునాథ్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

Similar News

News August 26, 2025

రాత్రి 10 తర్వాత వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఆపివేయాలి: ఎస్పీ

image

వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందామని, రాత్రి 10 గంటల తర్వాత వినాయక మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపివేయాలని విగ్రహ ఉత్సవ కమిటీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.

News August 26, 2025

పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిద్దాం: మంత్రి

image

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరి జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మంత్రి ఆకాక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

News August 26, 2025

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పండగ చేసుకుందాం: కలెక్టర్

image

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతీ ఒక్కరం వినాయక చవితి పండుగను జరుపుకుందామని కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గణనాథుని కృపతో జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలకు మంచి జరగాలని, చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరాలని ఆకాంక్షించారు.