News December 7, 2025
‘ క్రీమీలేయర్’ తీర్పుతో సొంతవర్గం నుంచే విమర్శలు: గవాయ్

SC రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలు తీర్పుతో తాను సొంతవర్గాల నుంచే విమర్శలు ఎదుర్కొన్నానని మాజీ CJI గవాయ్ పేర్కొన్నారు. ‘అంబేడ్కర్ దృష్టిలో జీరో దగ్గర ఉన్న వెనుకబడ్డ వ్యక్తికి సైకిల్ ఇవ్వాలి. అప్పుడే అతడు సైకిల్పై ముందున్న వారిని చేరుకొని సమానంగా నడుస్తాడు. అంతే తప్ప సైకిల్పై ఎప్పటికీ అతడే వెళ్తూ జీరో దగ్గర ఉన్నవారిని అలాగే ఉండాలనరాదు’ అని ముంబై వర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News March 6, 2026
చీకటిని చీల్చుతూ ఉదయించిన ‘రవి’కిరణుడు❤️

ఇవాళ రిలీజైన UPSC ఫలితాల్లో రాణించిన బిహార్కు చెందిన రవి రాజ్ స్పెషల్. తన చిన్నతనంలోనే చూపు కోల్పోయినా పట్టుదలతో చదివి 20వ ర్యాంకు సాధించి IAS అధికారి కాబోతున్నారు. ఈ ప్రయాణంలో తల్లి విభ ఆయనకు దిక్సూచిగా మారారు. ఆమె పుస్తకాలు చదివి వినిపిస్తూ, నోట్స్ రాస్తూ కుమారుడిని ప్రోత్సహించారు. ఇప్పటికే BPSC సాధించి.. పట్టుదలకు అమ్మ ప్రేమ తోడైతే గెలుపు సాధ్యమేనని రవి ప్రపంచానికి చాటిచెప్పారు.
News March 6, 2026
నా కథను రేప్ చేశారు.. రచయిత షాకింగ్ కామెంట్స్

సినీ రచయిత సాయిమాధవ్ బుర్రా FBలో షాకింగ్ పోస్టు చేశారు. ఓ మూవీలో తన కథను రేప్ చేశారని ఆరోపించారు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తవుతుంది. ఒక్కమాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసుకున్నారు. కథని మానభంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు.. అసలా కథే వేరు’ అని రాసుకొచ్చారు. వరలక్ష్మీ శరత్కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి, ఇవాళ రిలీజైన ‘సరస్వతి’ గురించే ఆయన మాట్లాడినట్లు సమాచారం.
News March 6, 2026
మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయం: CM

TG: మూసీ నదిలో చెత్త, మురికి పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో ఉండాలని ఎవరూ కోరుకోరని CM రేవంత్ చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలను విస్తరిస్తామని తెలిపారు. రంగారెడ్డి(D) కొత్వాల్గూడలో ఎకో పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అభివృద్ధి జరగాలంటే కొందరు భూమి కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ అన్యాయం చేయం. అందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తాం’ అని హామీ ఇచ్చారు.


