News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 5, 2026
కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్లో హైకోర్టులో పెండింగ్లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులు, రిట్ పిటిషన్లపై కలెక్టర్ శనివారం శ్యాంప్రసాద్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసులకు సంబంధించిన కౌంటర్ అఫిడవిట్లను వెంటనే దాఖలు చేయాలని, కోర్టు ఇచ్చిన గడువులోగా నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. న్యాయపరమైన అంశాల్లో నిర్లక్ష్యం చేస్తే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
News April 5, 2026
HYD: 4 నెలల్లో 56 మొబైల్ ఫోన్ చోరీలు

మల్కాజిగిరి పరిధిలో చోరీలపై ఆందోళనకర పరిస్థితి వెలుగులోకి వచ్చింది. గత 4 నెలల్లో నాచారం, కుషాయిగూడ, మల్కాజిగిరి PSల పరిధిలో మొత్తం 56 మొబైల్ ఫోన్ చోరీ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
News April 5, 2026
చిత్తూరు: రేపు ప్రత్యేక విద్యుత్ అదాలత్

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు యాదమరిలో ఏఈ కార్యాలయంలో యాదమరి, బంగారుపాళ్యం మండలాలకు సంబంధించిన సమస్యలు తెలుపవచ్చన్నారు. అలాగే చిత్తూరు గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటలకు చిత్తూరు, పూతలపట్టు మండల వినియోగదారులు సమస్యలను ఫిర్యాదు చేయవచ్చన్నారు.


