News June 25, 2024
క్లాస్ రూమ్ను ప్రారంభించిన పమేలా సత్పతి, మంచు లక్ష్మి

కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్(పోచంపల్లి)లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచ్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ రూమ్ను కలెక్టర్ పమేలా సత్పతి, సినీ నటి మంచు లక్ష్మి ప్రారంభించారు. మంగళవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాతృభాషను మరవొద్దని, ఇంగ్లిష్తో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలని సూచించారు.
Similar News
News December 28, 2025
కరీంనగర్: ఓపెన్ స్కూల్ పరీక్షా ఫీజు గడువు ఖరారు

తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు జనవరి 5 వరకు చెల్లించాలని జిల్లా కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ తెలిపారు. 25 రూపాయల ఫైన్తో జనవరి 6 నుంచి 12 వరకు, 50 రూపాయల ఫైన్తో జనవరి 13 నుంచి 16 వరకు, అలాగే తత్కాల్ పద్దతి కింద జనవరి 17 నుంచి 19 వరకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. వివరాలకు 9440415099 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
News December 28, 2025
జమ్మికుంట: అంబేద్కర్ వర్సిటీ పరీక్షా ఫీజు గడువు పొడిగింపు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే గడువును జనవరి 2వ తేదీ వరకు పొడిగించినట్లు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో బి.ఏ, బి.కామ్, బి.ఎస్సీ చదువుతున్న మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 28, 2025
KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.


