News February 7, 2026
క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన

AP: అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి CM చంద్రబాబు ఇవాళ 3PMకు ఉద్దండరాయునిపాలెంలో భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే తొలి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకొచ్చేందుకు IBM, TCS, L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News February 21, 2026
షాకింగ్.. ఒకే పార్కులో 72 పులులు మృతి

థాయ్లాండ్లోని ఓ ప్రైవేట్ పార్క్లో డెడ్లీ వైరస్ విజృంభించింది. దీంతో ఈనెల 8-19వ తేదీ మధ్య 72 పులులు మృత్యువాతపడ్డాయి. కనైన్ డిస్టెంపర్ వైరస్(CDV) కారణంగానే అవి చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంటువ్యాధి సోకగానే జ్వరం, కళ్ల నుంచి నీరు కారుతుంది. వాంతులు, విరేచనాలు వస్తాయి. కండరాలు బలహీనమై మరణం సంభవిస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. ముందస్తు టీకాతో నివారించవచ్చు. ఇది మనుషులకు సోకదు.
News February 21, 2026
లిక్కర్ స్కామ్.. A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పని చేశారు. గతంలో ఈయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
News February 21, 2026
గొర్రెల పెంపకం – పాక్షిక సాంద్ర పద్ధతి

పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెలను కొద్ది గంటల పాటు పచ్చిక బయళ్లలో మేపి మిగతా సమయం అంతా ఇంటివద్ద పాకలలో ఉంచి పెంచుతారు. అంతేకాక పాకలలో వాటికి పచ్చిగడ్డి, దాణా, త్రాగటానికి నీరు మొదలగునవి పెడతారు. ఈ పద్ధతిలో ఎంపిక చేసిన పొట్టేళ్లతోనే ఆడ గొర్రెలను జతకలపవచ్చు. బయట వృథాగా ఉన్న పచ్చిక బయళ్లను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.


